
Akshaya Tritiya 2025
అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తాయని నమ్ముతారు. రాశి ప్రకారం అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొనడం శుభప్రదమో జ్యోతిష్కులు చెప్పిన సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం.
అక్షయ తృతీయ 2025 తేదీ ఎప్పుడంటే
వాస్తవానికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం, అక్షయ తృతీయను 2025 ఏప్రిల్ 30న జరుపుకుంటారు.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ సమయం
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే బంగారం సంపద శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం బంగారం కొనడానికి అత్యంత పవిత్రమైన సమయం ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.
అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం ఏ వస్తువులను కొనాలంటే
- మేష రాశి: ఈ రాశి వారికి బంగారం కొనడం శుభప్రదం. మీరు బంగారు ఉంగరం లేదా ఏదైనా చిన్న ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
- వృషభం: వృషభ రాశి అధిపతి శుక్రుడు.. వెండి శుక్రుడికి సంబంధించినది. అందువల్ల ఈ రాశి వారు వెండి ఆభరణాలు, నాణేలు కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- మిథున రాశి: బంగారు గొలుసు లేదా చెవిపోగులు కొనడం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- కర్కాటకం: కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు వెండికి సంబంధించినవాడు. కనుక ఈ రాశి వారు ఏదైనా వెండి వస్తువు కొనడం శుభప్రదం.
- సింహ రాశి: సింహ రాశి వారు బంగారం కొనడం చాలా శుభప్రదం. ఈ రాశి వారు బంగారు లాకెట్ లేదా గొలుసు కొనవచ్చు.
- కన్య రాశి : కన్య రాశి వారికి, బంగారు గాజులు, ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం వల్ల కెరీర్లో విజయం సాధించవచ్చు.
- తుల రాశి: తుల రాశి వారు వెండి పట్టీలు కొని లక్ష్మీ దేవికి సమర్పించి ధరించాలి. ఇది వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని, మానసిక శాంతిని కాపాడుతుంది.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారు బంగారు ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం శుభప్రదం. అయితే ఈ రాశి అధిపతి కుజుడు కనుక పరిమిత పరిమాణంలో బంగారాన్ని ఉపయోగించడం మంచిది.
- ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి బంగారం ధరించడం చాలా ప్రయోజనకరం. మీరు బంగారు గొలుసు, పాపిడి బొట్టు లేదా ఏదైనా ఇతర ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
- మకర రాశి, కుంభ రాశి: ఈ రెండు రాశుల అధిపతి శనిశ్వరుడు. వెండికి సంబంధించినది. కనుక ఈ రాశుకి సంబంధించిన వ్యక్తులు వెండి ఆభరణాలు లేదా కాళ్ళ పట్టీలు కొనడం శుభప్రదం.
- మీనం రాశి: మీన రాశి అధిపతి బృహస్పతి. బంగారం బృహస్పతికి సంబంధించినది. కనుక ఈ రాశి వ్యక్తులు గాజులు, నెక్లెస్ లేదా చెవిపోగులు వంటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం శుభప్రదం
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు