కశ్మీర్లో ఎన్కౌంటర్.. వందలకొద్ది బుల్లెట్లు స్వాధీనం
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ సంఘటనాస్థలి..
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ సంఘటనాస్థలి వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని గుర్తించారు. చనిపోయిన ఓ ఉగ్రవాదిని లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ నసీరుద్దీన్గా గుర్తించారు. అతని వద్ద వందల కొద్ది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. మరో ఉగ్రవాది నుంచి కూడా బుల్లెట్లతో పాటుగా.. 10కి పైగా మ్యాగజైన్లు, రెండు రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, బుధవారం రాత్రి హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సైన్యాన్ని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. ఎదురుకాల్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Jammu & Kashmir: Arms & ammunition recovered from the two LeT terrorists, who were killed in an encounter with security forces in Handwara of Kupwara district yesterday. Top LeT Commander Naseer-u-din Lone, who was involved in the killing of CRPF jawans, was among those killed. pic.twitter.com/auX51asChh
— ANI (@ANI) August 20, 2020
Read More :