పోతిరెడ్డిపాడుపై త్వరలో అపెక్స్ భేటీ.. బండికి షెకావత్ లేఖ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని చర్చించేందుకు త్వరలో అపెక్స్ భేటీ నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఆదేశించారు.

పోతిరెడ్డిపాడుపై త్వరలో అపెక్స్ భేటీ.. బండికి షెకావత్ లేఖ
Follow us

|

Updated on: May 16, 2020 | 2:15 PM

KRMB apex committee meet on Potireddypadu soon:  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని చర్చించేందుకు త్వరలో అపెక్స్ భేటీ నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు రాసిన లేఖలో ధృవీకరించారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవో నంబర్ 203పై తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు శనివారం నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 11గంటల మధ్య తమ తమ ఇళ్ళపై నల్ల జెండాలు ఎగురవేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో తన ఇంటిపై నల్ల జెండా ఎగరేసి నిరసన తెలిపారు బండి సంజయ్. అనంతరం ఆయన మొబైల్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203 కారణంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రాసామని తెలిపారు. దానికి ఆయన స్పందించారని సంజయ్ వివరించారు. తక్షణమే అఫెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబిని కేంద్ర మంత్రి షెకావత్ ఆదేశించారని తెలిపారు. ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామని సంజయ్ అంటున్నారు.

పోతిరెడ్డిపాడు నీటి ఎత్తిపోతల సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ కు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతుందని సంజయ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన తెలిపారు. అపెక్స్ కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, అధికారులు తమ వాదనను సమర్థవంతంగా వినిపించి తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించాలని సంజయ్ డిమాండ్ చేశారు.

Read this: కరోనా కంటే కరెంటు షాకే డేంజర్… జగన్ సర్కార్‌పై జనసేన విమర్శ  

Read this: వలస కూలీలపై విరిగిన లాఠీ.. తాడేపల్లిలో దారుణం

Read this: ఉమ్మెత్త తింటే కరోనా రాదట..! చివరికి ఏమైందంటే? 

Latest Articles
హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే
హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..