ఏపీ: త్వరలోనే కరోనా బాధితులకు ఐసెట్ ఎగ్జామ్.!
కరోనా వైరస్ సోకిన కారణంగా క్వారంటైన్లో ఉండి ఐసెట్-2020 పరీక్షకు హాజరుకాని అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
AP ICET 2020: కరోనా వైరస్ సోకిన కారణంగా క్వారంటైన్లో ఉండి ఐసెట్-2020 పరీక్షకు హాజరుకాని అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు.. అభ్యర్థులను తమ హాల్టికెట్తో పాటు కరోనా పాజిటివ్ ధృవీకరణ పత్రాన్ని covidhelpdeskicet@gmail.comకు అక్టోబర్ 3వ తేదీలోగా పంపించాలన్నారు. వీరికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించే తేదీ, సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అలాగే కరోనా కారణంగా ఎంసెట్ 2020 పరీక్ష రాయని విద్యార్థులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.
Also Read:
మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!
ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..