కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ మఠం వెంకటరమణ ప్రమాణం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమర్ వీరిద్దరితో ప్రమాణం చేయించారు. తర్వాత జడ్జీల నియామక పత్రాల్ని నూతన జడ్జిలకు జస్టిస్ ప్రవీణ్ కుమార్ అందజేశారు. తొలిగా జస్టిస్‌ మానవేంద్రనాధ్‌ రాయ్‌, అనంతరం జస్టిస్‌ వెంకటరమణ ప్రమాణం చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. అయితే ఏపీకి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ఇంకా […]

కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2019 | 9:26 AM

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ మఠం వెంకటరమణ ప్రమాణం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమర్ వీరిద్దరితో ప్రమాణం చేయించారు. తర్వాత జడ్జీల నియామక పత్రాల్ని నూతన జడ్జిలకు జస్టిస్ ప్రవీణ్ కుమార్ అందజేశారు. తొలిగా జస్టిస్‌ మానవేంద్రనాధ్‌ రాయ్‌, అనంతరం జస్టిస్‌ వెంకటరమణ ప్రమాణం చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. అయితే ఏపీకి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ఇంకా 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.