ఏపీ : పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఎకరం 5 రూపాయలకే
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్టు కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 120 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనే టార్గెట్ గా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్టు కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 120 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనే టార్గెట్ గా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికోసం 5 లక్షల ఎకరాల భూమిని సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఉపయోగించనుంది. విండ్, సౌర విద్యుత్త్ ఉత్పత్తి రంగాల్లో ఇన్వెస్ట్ మెంట్స్ ఆకర్షించేందుకు కొంత విధానం తీసుకొచ్చినట్టు ఇంధన శాఖ వెల్లడించింది.
ఈ విధానంలో భాగంగా విండ్ విద్యుత్తు టర్బైన్లు, సౌర పలకల తయారీని ఎంకరేజ్ చెయ్యాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రాజెక్టు డెవలపర్ల నుంచి సంవత్సరానికి గవర్నమెంట్ భూమి అయితే ఎకరాకు 31 వేలు, ప్రైవేటు భూమికి అయితే 25 వేలు లీజు కింద వసూలు చేయనున్నారు. రెండేళ్లకొకసారి లీజు మొత్తాన్ని 5శాతం చొప్పున పెంచనున్నట్లు ఇంధన శాఖ వివరించింది. గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జీల కింద మెగావాట్కు సంవత్సరానికి లక్ష వసూలు చేస్తారు. నోటిఫై చేసిన కాసేపటికే కొత్త విధానంలో మార్పులు చేస్తూ గవర్నమెంట్ సవరణ ఆదేశాలు జారీ చేసింది.
దేశీయంగా సౌర విద్యుత్తు పలకల దిగుమతిపై సెంట్రల్ గవర్నమెంట్ విధించే కస్టమ్ డ్యూటీ భారాన్ని తగ్గించేందుకు ఈ సవరణ చేపట్టినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. లాంగ్ టర్మ్ లో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా కొనుగోలు చేసే కరెంట్ ధర భారం అవ్వకుండా ఆయా సంస్థలకు ఇచ్చే లీజు తగ్గించింది. ఈ మేరకు ఏడాదికి ఎకరాకు వసూలుచేసే లీజును 31వేల నుంచి 5రూపాయలకు తగ్గించారు. మరోవైపు రైతులకు 9గంటల ఉచిత కరెంట్ అందించేందుకు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టును ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. ఇందుకోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.