సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు

తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో

సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 12:47 PM

YS Jagan Srisailam tour: తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులు ఓ ప్రకటన చేశారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్‌.. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించాలని అధికారులకు ఆదేశించారు.

కాగా రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు.. ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించడంతో పాటు అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ జగన్‌ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని జగన్ అధికారులతో తెలిపారు. ఈ క్రమంలో జగన్‌ శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు.

Read More:

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

ఐఆర్‌సీటీసీలో మరికొంత వాటా విక్రయానికి సన్నాహాలు