AP News: ఏంట్రా ఇలా ఉన్నావ్.! భార్యను కాపురానికి పంపట్లేదని భర్త ఫ్రస్ట్రేషన్.. చివరికి జరిగిందిదే

ఓ పోకిరి అల్లుడు.. మామ ఇంటికెళ్లి వాహనాలను దగ్ధం చేశాడు. తన భార్యను పుట్టింటికి పంపడం లేదని ఎవరూ ఊహించని ఘటనకు కారకుడయ్యాడు. ఎన్నో రోజులుగా భార్యను కాపురానికి పంపమని చెబుతున్నా.. అందుకు అత్తమామలు నిరాకరిస్తూ రావడంతో.. ఆగ్రహంతో ఊగిపోయాడు ఆ అల్లుడు.

AP News: ఏంట్రా ఇలా ఉన్నావ్.! భార్యను కాపురానికి పంపట్లేదని భర్త ఫ్రస్ట్రేషన్.. చివరికి జరిగిందిదే
Machilipatnam
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 01, 2024 | 7:04 PM

ఓ పోకిరి అల్లుడు.. మామ ఇంటికెళ్లి వాహనాలను దగ్ధం చేశాడు. తన భార్యను పుట్టింటికి పంపడం లేదని ఎవరూ ఊహించని ఘటనకు కారకుడయ్యాడు. ఎన్నో రోజులుగా భార్యను కాపురానికి పంపమని చెబుతున్నా.. అందుకు అత్తమామలు నిరాకరిస్తూ రావడంతో.. ఆగ్రహంతో ఊగిపోయాడు ఆ అల్లుడు. నేరుగా మామ ఇంటికి వెళ్లి.. ఇంటి ముందు పార్క్ చేసిన అన్ని వాహనాలను తగలబెట్టాడు. దీంతో ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక.. ఆ ఇంట్లో ఉన్న అత్త, మామ, భార్య ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మచిలిపట్నంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో పిల్లనిచ్చిన మామకు చెందిన 5 వాహనాలను అల్లుడు తగులబెట్టాడు. మచిలీపట్నంలోని భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ పుట్టింటికి రాగా.. తన భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తింటి వారిని అల్లుడు కోరాడు. భార్య కాపురానికి రాకపోవడంతో తన అత్త మామ కారణమని భావించి.. అర్ధరాత్రి భార్య పుట్టింటికి వెళ్లి వాహనాలకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మామ గండికోట శ్యాంప్రసాద్.. తన అల్లుడు దాసరి శబరినాధ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

శబరినాథ్ జల్సాలకు అలవాటుపడి ఉద్యోగం మానివేసి తన కుమార్తెను వేధింపులు గురి చేస్తున్నాడని.. 15 రోజుల క్రితం పుట్టింటికి రావడంతోనే తన అల్లుడు శబరినాధ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి బైకులు దాహనం చేశాడని.. తన వాహనాలతో పాటు తన పెదనాన్నకు చెందిన మరో 3 వాహనాలు సైతం దగ్ధం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు గండికోట శ్యాంప్రసాద్. కాగా, పోకిరి అల్లుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.