APSRTC: విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు ప్రత్యేక ఆఫర్.. ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.!

APSRTC Offer: విజయవాడ నుంచి బెంగళూరు ప్రయాణించేవారికి ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ రెండు నగరాల...

APSRTC: విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు ప్రత్యేక ఆఫర్.. ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.!
Apsrtc
Follow us

|

Updated on: Jan 21, 2022 | 9:19 AM

విజయవాడ నుంచి బెంగళూరు ప్రయాణించేవారికి ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య నడిచే వెన్నెల, అమరావతి(ఏసీ) బస్సు సర్వీసుల్లోని టికెట్ ఛార్జీలపై 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి స్టేషన్ల మీదుగా ఈ బస్సులు ప్రయాణిస్తుండగా.. ఆయా స్టేషన్లలో ఎక్కే ప్రయాణీకులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఆదివారం విజయవాడ(Vijayawada) నుంచి బెంగళూరు(Bengaluru) వెళ్లే సర్వీసుల్లో… అలాగే శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే సర్వీసుల్లో మాత్రం సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నారు.

విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్ సర్వీసు టికెట్ ధరను రూ. 1490గా నిర్ణయిస్తే… అమరావతి(ఏసీ) బస్సు టికెట్ ఛార్జీని రూ. 1365గా నిర్ణయించారు. ఇక బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వెన్నెల స్లీపర్ సర్వీసుకు రూ.1490, అమరావతి సర్వీసుకు రూ.1365లను టికెట్‌ ఛార్జీలుగా వసూలు చేస్తారు. కాగా, ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెల్లడించారు.

Also Read: 

స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!