Weather Update: ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు , ఎండలపై తాజా అప్‌డేట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు మరికొన్ని జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఆదివారం ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Weather Update: ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షాలు , ఎండలపై తాజా అప్‌డేట్
Ap Weather Forecast

Updated on: May 02, 2026 | 8:30 PM

ఏపీ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని పులు జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు. మరోవైపు విజయనగరం 10, మన్యం 12, అల్లూరి1, పోలవరం 5, తూర్పుగోదావరి 3, ఏలూరు 2, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, గుంటూరు 12, బాపట్ల 9, పల్నాడు 22, మార్కాపురం 3, ప్రకాశం 15, నెల్లూరు 4, తిరుపతి 5 మొత్తంగా 124 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆదివారం ఈ జిల్లాల్లో వర్షాలు

మరోవైపు రాజస్థాన్‌ పై గల ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ,తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

శనివారం రాష్ట్రంలో వాతావరణం

ఇదిలా ఉండగా రాష్ట్రంలో శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. కడప జిల్లా 34 మండలాలు, నెల్లూరు 32, తిరుపతి 29, పల్నాడు 26, ప్రకాశం 25, మార్కాపురం 21, నంద్యాల20 , కర్నూలు17, చిత్తూరు జిల్లా 10 మండలాల్లో ఎక్కువగా ప్రభావం చూపిందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us