రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్..ఆదా అయ్యింది ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్‌లోని 65 ప్యాకేజి పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు అంటే.. మొత్తం పని విలువలో 43 కోట్ల తక్కువకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా.. ఎల్-1గా బిడ్ దాఖలు చేసినట్లుగా తెలిసింది. గత టిడిపి ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని 292.02 కోట్లకు ఇప్పుడు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రానే సొంతం చేసుకుంది.  దానిని రద్దు చేసిన వైయస్ జగన్ […]

రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్..ఆదా అయ్యింది ఎంతో తెలుసా?
Follow us

|

Updated on: Sep 20, 2019 | 9:09 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్‌లోని 65 ప్యాకేజి పనికి టెండర్ పిలవగా అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు అంటే.. మొత్తం పని విలువలో 43 కోట్ల తక్కువకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా.. ఎల్-1గా బిడ్ దాఖలు చేసినట్లుగా తెలిసింది. గత టిడిపి ప్రభుత్వంలో ఇదే ప్యాకేజీని 292.02 కోట్లకు ఇప్పుడు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్‌ఫ్రానే సొంతం చేసుకుంది.  దానిని రద్దు చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా టెండర్లకు ఆహ్వనించింది. తాజా బిడ్డింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి రూ58.53 కోట్లు ఆదా కానుంది. కేవలం మూడు వందల కోట్ల పనిలోనే రివర్స్ టెండరింగ్‌లో ఇంత ఆదా ఉంటే భవిష్యత్తులో ఖరారు కానున్న హైడల్, హెడ్వరిస్క్ సంబంధించిన పనుల్లో ఎంత మొత్తం ఆదా అవుతుందో ఊహించుకోవచ్చు.

సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే రివర్స్ టెండరింగ్లో ఎల్-1గా వచ్చిన సంస్థ ధరను బేసిక్ బెంచ్ మార్క్‌గా ప్రకటించి దాని ఆదారంగా మరింత తక్కువకు సంస్థలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దాంతో తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా బిడ్డు దాఖలు చేసింది. మిగిలిన సంస్థకన్నా ఇది బాగా తక్కువ కావడంతో ఈ సంస్థకు పనిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 11 గంట నుంచి ఈ-ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. ఇందులో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. రెండు గంటల 45 నిమిషాల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు. అత్యంత తక్కువకు బిడ్ వేసిన సంస్థ అర్హతలను పరిశీలించి పనులు అప్పగించే అవకాశం ఉంది. దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. ఇందులో ఆరు బడా సంస్థలు పోటీపడటాన్ని బట్టి చూస్తే.. కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారయ్యే అవకాశం ఉందని దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అవుతాయని జలవనరులశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.