సోషల్ మీడియాపై ఆలియా సంచలన కామెంట్స్
ప్రజంట్ సోషల్ మీడియా ప్రజల్ని ఒక్కటి చేయకుండా, వేరు చేస్తుందని బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అభిప్రాయపడ్డారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్షర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో తనను సభ్యురాలిగా చేరాలని ఆహ్వానించడంపై వారికి ఆమె ధన్యావాదాలు తెలిపారు.
ప్రజంట్ సోషల్ మీడియా ప్రజల్ని ఒక్కటి చేయకుండా, వేరు చేస్తుందని బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అభిప్రాయపడ్డారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్షర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో తనను సభ్యురాలిగా చేరాలని ఆహ్వానించడంపై వారికి ఆమె ధన్యావాదాలు తెలిపారు. ఈ ఆహ్వానాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన ఆలియా.. భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయి వేదికపై వినిపిస్తున్నందుకు ఆనందంగా ఉన్నారు. ఇండియాలోని సినిమా నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులను అకాడమీ గుర్తించడం మంచి పరిణామమన్నారు.
సినిమా, నీరు.. ఒకే పోలీకను కలిగి ఉంటాయని ఆలియా అభిప్రాపడ్డారు. తన, మన, జాతి, హద్దు లాంటి పట్టింపులు లేకుండా స్వేచ్ఛగా ప్రవహిస్తాయని పేర్కొన్నారు. సినిమా పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు కానీ, అది ఓ శక్తివంతమైన వాహకం అని తెలిపారు. అయితే ప్రజలను ఒక్కటి చేసేందుకు పుట్టిన సోషల్ మీడియా.. ప్రస్తుతం వారిని వేరు చేస్తుందని ఆలియా ఆవేదన వ్యక్తం చేశారు
ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, హృతిక్ రోషన్ సహా 819 మంది కళాకారులు, ఎగ్జిక్యూటివ్లకు ఆస్కార్క్ నుంచి ఇన్విటేషన్ అందింది. ఇదే సమయంలో బాలీవుడ్ లో నెపోటిజం ఆశ్రిత పక్షపాతం ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ పెద్దలపై భారీ ఎత్తున్న ట్రోలింగ్ నడుస్తోంది. ఈ సమయంలో స్పందించిన ఆలియా.. సామాజిక మాద్యమాలపై ఈ కామెంట్స్ చేసింది.