ప్రభాస్ తరువాత చెర్రీ.. ఆ క్రేజీ హిట్ సీక్వెల్లో!
టాలీవుడ్లోని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ మళ్లీ బిజీ అవుతోంది. వరుస భారీ సినిమాలను చేసేలా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది
Ram Charan Vyajayanthi movies: టాలీవుడ్లోని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ మళ్లీ బిజీ అవుతోంది. వరుస భారీ సినిమాలను చేసేలా ప్రణాళికలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభాస్తో ఓ మూవీని ప్రకటించింది. నాగ్అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమాను తీయాలన్న ప్లాన్లో నిర్మాత అశ్వనీదత్ ఉన్నారట.
చిరుతో అశ్వనీదత్కి చాలా సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు వైజయంతీ మూవీస్ బ్యానర్లోనే చిరుత సినిమాతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఇప్పుడు అతడితో మరోసారి మూవీని తీసేందుకు అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారట. అశ్వనీదత్ నిర్మాణంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ ఈ ఏడాది మే 9కు 30 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ మూవీ సీక్వెల్ని కచ్చితంగా తీస్తానంటూ అశ్వనీదత్ కూడా స్పష్టం చేశారు. ఇక ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ సీక్వెల్లో రామ్ చరణ్ నటిస్తే అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ తరువాత జగదేగ వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తెరకెక్కనుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నారు. దాంతో పాటు చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Read More: