బిహార్‌లో పెరుగుతున్న కేసులు.. తాజాగా కొత్తగా 180 కేసులు..

బిహార్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి

బిహార్‌లో పెరుగుతున్న కేసులు.. తాజాగా కొత్తగా 180 కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 6:19 PM

బిహార్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో.. అత్యల్పంగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రాల్లో కూడా.. ఇప్పుడు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శనివారం నాడు.. కొత్తగా మరో 180 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,858కి చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, దేశ వ్యాప్తంగా శనివారం నాడు.. ఐదు లక్షల మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 18,552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,97,387 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు 2,95,880 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 15,685 మంది మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.