ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెర్రర్.. తీవ్రంగా పెరుగుతోన్న కేసులు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,39,50,035 నమోదు కాగా, కరోనాతో మొత్తం ఇప్పటివరకూ 5,92,696 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 50,77,646 యాక్టీవ్ కేసులు ఉండగా, 82,79,182 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 68,428 కరోనా కసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 36,95,025కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 1,41,118 మంది మృతి చెందారు. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.
అలాగే భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,956 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న 687 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,03,832కి చేరుకుంది. ప్రస్తుతం 3,42,473 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 6,35,757 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం మరణించిన వారి సంఖ్య 25,602.