బ్యాక్‌ టు ఫామ్‌.. నియంత పనులు ప్రారంభించేసిన కిమ్..!

మొన్నటివరకు ప్రపంచమంతా కరోనా తరువాత ఎక్కువగా వినిపించిన పేరు కిమ్. కిమ్ ఎక్కడున్నాడు..? కిమ్‌కు ఏమైంది..? కిమ్ చనిపోయారా..?

బ్యాక్‌ టు ఫామ్‌.. నియంత పనులు ప్రారంభించేసిన కిమ్..!
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 7:53 PM

మొన్నటివరకు ప్రపంచమంతా కరోనా తరువాత ఎక్కువగా వినిపించిన పేరు కిమ్. కిమ్ ఎక్కడున్నాడు..? కిమ్‌కు ఏమైంది..? కిమ్ చనిపోయారా..? ఇలా పలు ప్రశ్నలు వినిపించాయి. అయితే వాటన్నింటిని చెక్‌ పెడుతూ శుక్రవారం దర్శకమిచ్చాడు కిమ్. తన సోదరి కిమ్‌ యో జోంగ్ అందించిన కత్తెరతో ఓ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించారు. దీంతో కిమ్‌కు ఏం కాలేదని కన్ఫర్మేషన్‌ వచ్చింది. అయితే ఇలా వచ్చాడో లేదో.. అప్పుడు తన నియంత పనులను ప్రారంభించేశాడు కిమ్‌.

తాజాగా రెండు కొరియా దేశాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. చియోర్వాన్‌లోని రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ.. ఇరు దేశాల జవాన్లు కాల్పులు జరుపుకున్నారు. ఇరు దేశాల మధ్య కాల్పులు దాదాపు ఐదేళ్ల తరువాత కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దక్షిణ కొరియా జవాన్లకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ మిలిటరీ వెల్లడించింది. మొదట ఉత్తర కొరియానే కాల్పులు జరిపిందని దక్షిణ కొరియా వెల్లడించింది. కాల్పుల నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. కాగా కాల్పుల ఘటనతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Read This Story Also: Breaking: తెలంగాణలో మందు బాబులకు షాక్‌..!

Latest Articles