Nuclear Attack: భారత్పై అణు దాడికి సిద్ధమైన పాకిస్తాన్.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన అమెరికా మాజీ విదేశాంగ మంత్రి..
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తన పుస్తకం 'నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్'లో షాకింగ్ క్లెయిమ్ చేశారు.
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పాకిస్థాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ పీటీఐ అందించిన సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2019 లో బాలాకోట్లో భారతదేశం సర్జికల్ స్ట్రైక్ తరువాత.. పాకిస్తాన్ భారతదేశంపై అణు దాడికి సిద్ధమైందని బాంబు పేల్చారు. అణు దాడికి సంబంధించిన ఈ సమాచారాన్ని అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తనకు తెలిపారని మైక్ పాంపియో తన ‘నెవర్ గివ్ ఏ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ పుస్తకంలో పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 27-28 తేదీల్లో ఈ సంఘటన జరిగినప్పుడు.. తాను అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర సమావేశం కోసం హనోయికి వెళ్లినట్లుగా తెలిపారు. దీని తర్వాత అతని బృందం న్యూఢిల్లీ, ఇస్లామాబాద్తో మాట్లాడిందని అన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధం అణుదాడికి ఎంత దగ్గరగా వచ్చిందో ప్రపంచానికి తెలియదని నేను అనుకోవడం లేదన్నారు. ఫిబ్రవరి 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిదే. దీనికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసింది.
పాకిస్థాన్ ఏం చెప్పింది?
వియత్నాంలోని హనోయ్లో ఉన్న ఆ రాత్రిని ఎప్పటికీ మర్చిపోలేనని మైక్ పాంపియో గుర్తు చేసుకున్నారు. పాక్ అణు దాడికి సంబంధించి తాను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో మాట్లాడానని ఆయన తెలిపారు. భారత్ ఏం చెప్పిందో పాంపియో తనకు చెప్పారని.. అయితే అది తప్పు అని బజ్వా అన్నారు. అయితే, పాంపియో వాదనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏమీ చెప్పలేదన్నారు. మనం చేసిన పనిని ఏ దేశం చేయలేదని మైక్ పాంపియో పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం