అప్పుడు ‘వర్క్ ఫ్రం హోమ్’ కొత్త ప్రామాణికం అవ్వొచ్చు: కేంద్ర మంత్రి
భారత్లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు.
భారత్లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు లాక్డౌన్ పాటిస్తుండడంతో వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు ‘ఇంటి నుంచే పని’ చేయాలని ఆయా సంస్థలు ఆదేశిస్తున్నాయి.
కాగా.. ‘అత్యవసర విభాగాల్లో పని చేసేవారు తప్ప మిగతా ఉద్యోగులంతా ‘వర్క్ ఫ్రం హోమ్’ చేస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తాజాగా స్పందించారు. కరోనా వైరస్ వెళ్లిపోయాక ‘వర్క్ ఫ్రం హోమ్’ అనేది కొత్త ప్రామాణికంగా మారుతుందని చెప్పారు. ‘కరోనా వెళ్లిపోయాక ఈ ప్రపంచం మరోలా రూపాంతరం చెందుతుంది. ”ఇంటి నుంచి పని”చేసే కొత్త ప్రామాణికం పుట్టుకొస్తుంది. అయితే, భారత దేశ ‘వర్క్ ఫ్రం హోమ్’ పద్ధతి తెలిసేలా.. నా శాఖలోని సిబ్బందిని బలమైన యంత్రాంగంతో పనిచేయాలని చెప్పా. అది ఆర్థికంగా, లాభసాటిగా ఉంటుందని తెలిపా’ అని రవిశంకర్ పేర్కొన్నారు.