బెజవాడ కోవిడ్ ఆస్పత్రిలో మహిళ ఆత్మహత్యాయత్నం : రీజన్ ?
కరోనా మనుషులలోని కొత్త కోణాలను వెలుగులోకి తీసుకొస్తోంది. వైరస్ వీరవిహారం చేస్తోన్న వేళ.. కనీసం మానవత్వం లేకుండా మనుషులు ప్రవర్తిస్తోన్న తీరు చూస్తుంటే కడుపులో దేవుతుంది.
Corona patient suicide : కరోనా మనుషులలోని కొత్త కోణాలను వెలుగులోకి తీసుకొస్తోంది. వైరస్ వీరవిహారం చేస్తోన్న వేళ.. కనీసం మానవత్వం లేకుండా మనుషులు ప్రవర్తిస్తోన్న తీరు చూస్తుంటే కడుపులో దేవుతుంది. కలిసి పోరాటం చేయాల్సిన సమయంలో మనుషులు..మానవ సంబంధాల్ని కకావికలం చేస్తున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన ఈ ఘటన అందుకు మరో నిదర్శనం.
విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రి రెండో అంతస్థు నుంచి ఆదిలక్ష్మి అనే మహిళ కిందకు దూకింది. తీవ్రగాయాలవ్వడంతో..వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పోలీసులు విచారణ చెయ్యగా, దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలక్ష్మి కరోనాతో పోరాటం చేసి కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనస్థానం చెందిన ఆదిలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా సదరు మహిళది చల్లపల్లి మండలం నారాయణపురంగా గుర్తించిన పోలీసులు..ఘటనపై విచారణ చేస్తున్నారు.
Read More : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !