గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !
ఈ మధ్యకాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నవారు..మీ ఖాతాల్లో సబ్సీడీ డబ్బులు పడ్డాయో, లేదో చూసుకున్నారా. అవి మీ అకౌంట్లో జమ అయి ఉండవు.
No Subsidy On Gas Cylinders : ఈ మధ్యకాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నవారు..మీ ఖాతాల్లో సబ్సీడీ డబ్బులు పడ్డాయో, లేదో చూసుకున్నారా. అవి మీ అకౌంట్లో జమ అయి ఉండవు. గత మూడు నెలలుగా కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమవ్వడం లేదు. 2020 మే నెల నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వారికి సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో పడటం లేదు. మే నెల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ డబ్బులను నిలిపివేసింది.
ఇలా ఎందుకు జరిగిందంటే..
గత సంవత్సర కాలంలో సబ్సిడీ లేనటువంటి గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల రేటు పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు సబ్సిడీ సిలిండర్, సబ్సిడీ లేనటువంటి సిలిండర్ ధరలు దాదాపు లెవల్ అయ్యాయి. అందుకే మోదీ సర్కార్ సబ్సిడీని బంద్ చేసింది.
ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సాధారణంగా ఏడాదిలో ప్రతి ఫ్యామిలీకి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు ఇది వర్తిస్తుంది. అయితే సంవత్సరంలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ డబ్బులు అందవు. సిలిండర్ మార్కెట్ ధరను చెల్లించాలి. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య