ఏసీ బోగీలో ఊహించని పరిణామం..వణికిపోయిన ప్రయాణికులు
మనం ప్రయాణించే బస్సు, రైళ్ల కిటికీల్లోంచి వర్షం వస్తే దానికే హడావుడీ చేస్తాం. కానీ నడుస్తున్న ట్రైన్లో అదీ ఏసీ బోగీలో నీళ్లు వరదలా పారితే ఎలా ఉంటుంది. సంఘమిత్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో సేమ్ టు సేమ్ ఇదే జరిగింది. స్పీడుగా దూసుకుపోతున్నట్రైన్లో ప్రయాణికులపై ఎవరో నీటిని కుండలతో ఎత్తిపోస్తున్నట్టుగా అయ్యింది పరిస్థితి. ఒక్కసారిగా జరిగిన హఠాత్పరిణామంతో ప్రయాణికులు అక్కడేం జరుగుతుందో అర్ధం కాక భయపడిపోయారు. ముఖ్యంగా ఆయా బెర్త్లలోని సీనియర్ సిటిజన్లు బాగా ఇబ్బంది పడ్డారు. […]
మనం ప్రయాణించే బస్సు, రైళ్ల కిటికీల్లోంచి వర్షం వస్తే దానికే హడావుడీ చేస్తాం. కానీ నడుస్తున్న ట్రైన్లో అదీ ఏసీ బోగీలో నీళ్లు వరదలా పారితే ఎలా ఉంటుంది. సంఘమిత్ర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో సేమ్ టు సేమ్ ఇదే జరిగింది.
స్పీడుగా దూసుకుపోతున్నట్రైన్లో ప్రయాణికులపై ఎవరో నీటిని కుండలతో ఎత్తిపోస్తున్నట్టుగా అయ్యింది పరిస్థితి. ఒక్కసారిగా జరిగిన హఠాత్పరిణామంతో ప్రయాణికులు అక్కడేం జరుగుతుందో అర్ధం కాక భయపడిపోయారు. ముఖ్యంగా ఆయా బెర్త్లలోని సీనియర్ సిటిజన్లు బాగా ఇబ్బంది పడ్డారు.
అయితే ఈ నీరంతా ఏసీల నుంచి వచ్చినట్టుగా తేల్చారు. దీన్ని అందులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
संगमित्रा सुपर फ़ास्ट A1 का हाल, यात्री परेशान, pic.twitter.com/6pSzqKPjmB
— suyagya rai (@RaiSuyagya) June 29, 2019