రైతుల నిరసనకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా, పోలీసుల లాఠీఛార్జ్

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ధర్నా చేశారు.  వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్లను  ఉపయోగించారు.  హర్యానాలో ..

రైతుల నిరసనకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా, పోలీసుల లాఠీఛార్జ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 02, 2020 | 3:46 PM

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా పంజాబ్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ధర్నా చేశారు.  వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్లను  ఉపయోగించారు.  హర్యానాలో   ఈ పార్టీ కార్యకర్తలు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసాన్ని ముట్టడించారు. రైతులపై పోలీసుల బలప్రయోగానికి ఆయన  క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తాము కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ఆందోళన చేస్తున్న అన్నదాతలతో కలిసి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. కాగా సింఘు బోర్డర్ వద్ద సమావేశం నిర్వహించిన రైతులు తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. వీరి నిరసన కారణంగా నోయిడా-ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు.

అటు రేపు కేంద్రంతో మళ్ళీ తాము జరపబోయే చర్చల్లో ఎలాంటి విధానం అనుసరించాలన్న దానిపై బుధవారం అన్నదాతలు తమలో తాము చర్చించుకున్నారు.  ఈ రోజు కూడా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్, హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. ఇలా ఉండగా.. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ సింగ్ మస్త్ ఆరోపించారు. రైతుల్లో కలిగిన అపోహలను తొలగించే బదులు విపక్షాలు వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. నిజానికి రైతు చట్టాల వల్ల వారి ఆదాయం పెరుగుతుందని, ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలని ఆయన అన్నారు. వారి ఆటలు సాగబోవని హెచ్చరించారు.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..