ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేడు- ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఈరోజు శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనున్నది. ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వహించనున్నారు...

ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేడు- ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
Follow us

|

Updated on: Apr 07, 2020 | 9:37 AM

టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఈరోజు శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనున్నది. ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భ‌క్తులు రాముల‌వారి క‌ల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనున్నారు. భక్తులు తమ ఇండ్ల నుంచే స్వామి వారి కల్యాణాన్ని వీక్షించాల్సిందిగా ఆలయ నిర్వాకులుకోరారు.