థాయ్ లాండ్ లో ప్రమాదం.. 14 మంది మృతి

|

Dec 05, 2023 | 9:45 PM

ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది. కొంత భాగం బాగా దెబ్బతింది . ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో 14 మంది స్పాట్ లోనే చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది. కొంత భాగం బాగా దెబ్బతింది . ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికుల్లో 14 మంది స్పాట్ లోనే చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రచౌప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. వేగం కంట్రోల్ కాకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బస్సు ఢీ కొట్టిందని వివరించారు. అయితే, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందని అధికారులు వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్‌.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు

TOP 9 ET News: క్లీన్‌గా హాయ్‌ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి

Follow us on