విశాఖలో మౌనిక హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు
విశాఖలో మౌనిక హత్య కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. తొలుత తన ఫ్లాట్లోనే మౌనికను హత్య చేశానని చెప్పిన రవీంద్ర, తాజాగా స్నేహితుడి ఇంట్లోనే హత్య చేసి, మృతదేహాన్ని సూట్కేసులో తన ఫ్లాట్కు తరలించినట్లు అంగీకరించాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసు దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్రను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించగా, కీలక విషయాలు బయటపడ్డాయి. తొలుత మౌనికను తన ఫ్లాట్లోనే హత్య చేసినట్లు రవీంద్ర వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సెల్ఫోన్ సిగ్నల్స్కు అతని వాంగ్మూలం పొంతన లేకపోవడంతో లోతుగా విచారించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మామూలు దొంగలు కాదు.. 12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
Allu Arjun: బన్నీ బర్త్డే హంగామా..ఇంటి ముందు వేలాది మంది అభిమానులు..
ఒడిశా టు విజయవాడ.. కారులో తరలిస్తున్న రూ. కోట్లు పట్టివేత
ప్రపంచానికి గుడ్ న్యూస్..దిగొస్తున్న చమురు ధరలు.. ట్రంప్ కు తప్పని తలపోటు
అణుశక్తిలో భారత్ కు మరో విజయం.. క్రిటికాలిటీకి చేరిన కల్పక్కం రియాక్టర్ !!
