సిక్కోలు తీరంలో భారీ తిమింగలం…ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

Updated on: Dec 07, 2025 | 11:34 AM

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కం నేతాజీ బీచ్‌కు భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. బలమైన అలల ధాటికి ఒడ్డుకు చేరిన సుమారు 800 కేజీల బరువున్న తిమింగలాన్ని తిరిగి సముద్రంలోకి నెట్టేందుకు స్థానిక మత్స్యకారులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు విఫలం కావడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.

బంగాళఖాతంలోని తూర్పు తీర ప్రాంతం అరుదైన సముద్ర జీవులకు, ముఖ్యంగా తిమింగలాలు, డాల్ఫిన్లకు ప్రసిద్ధి. అయితే ఇటీవలి కాలంలో బలమైన సముద్ర కెరటాల కారణంగా ఈ జీవులు తరచుగా తీరానికి కొట్టుకువస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సుదీర్ఘ తీరప్రాంతం (193 కిలోమీటర్లు) ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కంలోని నేతాజీ బీచ్‌కి ఒక భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. బలమైన సముద్ర కెరటాల ధాటికి ఒడ్డుకు చేరిన ఈ తిమింగలం తిరిగి సముద్రంలోకి వెళ్లలేక ఒడ్డున ఉండిపోయింది. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు, తిమింగలం బతికే ఉందని నిర్ధారించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో