తిమింగలం కక్కిన పదార్థానికి.. ఫుల్ డిమాండ్.. ఏమిటి దాని స్పెషల్ ??

Updated on: Apr 19, 2025 | 5:54 PM

కర్ణాటకలో గుట్టు చప్పుడు కాకుండా అంబర్​గ్రీస్​ను.. అంటే తిమింగలం వాంతిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ. 10 కోట్లు విలువ చేసే 10.390 కిలోల పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు విరాజ్‌పేట్‌ పోలీసులు. పది మంది ముఠాను అరెస్ట్‌ చేశారు. కేరళలోని తిరువనంతపురం నుంచి వయా బెంగళూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు అంబర్‌గ్రీస్‌ను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి ఇన్నోవా కారు, క్యాష్‌ కౌంటింగ్‌ మిషిన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటివి మరెక్కడైనా చేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు. అంబర్ ​​గ్రీస్ పదార్థం సాధారణంగా తిమింగలం జీర్ణవ్యవస్థలో తయారవుతుంది. అది వాంతి చేసుకున్నప్పుడు, ఉమ్మినప్పుడు బయటకు వస్తుంది. సెంట్లు, పెర్ఫ్యూమ్ ల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఒక్క కిలో అంబర్ ​​గ్రీస్​కు రూ.కోట్లలో ధర ఉంటుంది. ఇండోనేషియా, ఇంగ్లాండ్ లో ఈ పదార్థానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అంబర్​ గ్రీస్ అమ్మకాలను 1972 వన్యప్రాణుల చట్టం కింద నిషేధించారు. అయినా సరే అక్రమంగా దీనిని సేకరించి.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు.. గుర్తించడం ఎలా?