AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఇంటి ఈఎంఐ కట్టడానికి ఖతర్నాక్‌ ఐడియా

కొత్త ఇంటి ఈఎంఐ కట్టడానికి ఖతర్నాక్‌ ఐడియా

Phani CH
|

Updated on: Oct 01, 2025 | 4:08 PM

Share

వ్యాపారులు, వ్యాపార సంస్థలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. ఎలాగైనా వినియోగదారుడు తమ వ్యాపార కేంద్రాలకు వచ్చేలా ఐడియాలు వేస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ స్థలాలు, ఇళ్లు, భూములను అమ్మేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు విచిత్రమైన ఐడియా వేశాడు.

అతడు టాలెంట్ కు వాహ్ అంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు చెందిన రాంబ్రహ్మం.. ఇటీవల ఓ కొత్త ఇంటిని కట్టుకున్నాడు. ఇదే సమయంలో చౌటుప్పల్ లోని తనకున్న రేకుల గదితో సహా 66 గజాల స్థలాన్ని అమ్మే ప్రయత్నం చేశాడు. ఏడాదిగా ఆ స్థలాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నా సేల్‌ కావడంలేదు. మరోవైపు నూతన ఇంటికి డబ్బులు చెల్లించాల్సిన వాయిదా దగ్గరపడుతోంది. దీంతో ఎలాగైనా ఇంటి స్థలాన్ని విక్రయించాలని ఓ కొత్త ప్లాన్‌ వేశాడు. ఇందులో భాగంగా తన స్థలం వద్ద ఓ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశాడు. స్థలం కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారు రూ.500 విలువైన కూపన్ ను కొనుగోలు చేసి లక్కీడ్రాలో పాల్గొనాలని జాతీయ రహదారి పక్కన ఫ్లెక్సీలు కట్టారు. దీంతో ఆ ఫ్లెక్సీలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. స్థలం విక్రయం పేరుతో 3000 కూపన్లను ముద్రించాడు. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు ఆ కూపన్స్ ను కొనుగోలు చేసి తమ పూర్తి వివరాలను రాసి వేసేందుకు ఓ డబ్బాను కూడా ఏర్పాటు చేశాడు. స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం, గది విలువ రూ.16 లక్షలు ఉంటుందనీ, ఏడాదిన్నర కాలంగా ఈ స్థలాన్ని అమ్మకానికి పెట్టినప్పటికీ సరైన ధర రాలేదని రాంబ్రహ్మం చెబుతున్నాడు. అందుకే ఇలాంటి కొత్త ఐడియాతో తన ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యానని చెబుతున్నాడు. కూపన్స్, లక్కీ డ్రా ను నవంబర్ రెండో తేదీన నిర్వహిస్తానని చెబుతున్నాడు. ఇంటి స్థలాన్ని అమ్మేందుకు లక్కీ డ్రా అనే పద్ధతి సరైనది కానప్పటికీ.. రాంబ్రహ్మం ఐడియాను మాత్రం అందరూ సూపర్ అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి

మహానందిని వీడని పాములు.. భయాందోళనలో భక్తులు

గురక ప్రాణాంతకమా.. నిపుణుల హెచ్చరిక

Gold Price: బాబోయ్‌ బంగారం ధర మోత మోగిపోతోంది..

రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ పక్షి జాడ కనిపెట్టారు..!