Jai Shri Ram: దండకారణ్యంలో శ్రీరాముడి చారిత్రక ఆనవాళ్లు.. వనవాసం కాలం నాటి రహస్య ఆలయాలు

Updated on: Mar 03, 2026 | 8:30 AM

శ్రీరాముడు తన వనవాసంలో ఎక్కువ భాగం దండకారణ్యంలోనే గడిపాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అడవులలో అదృశ్యంగా ఉన్న రామాయణ కాలం నాటి రహస్య ఆలయాలు, శ్రీరాముడు, సీతాదేవి అడుగుజాడలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా శ్రీరాముడి చరిత్రకు నిదర్శనం.

శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాసంలో అత్యధిక కాలాన్ని దండకారణ్యంలోనే గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర భూమిలో శ్రీరాముడి అడుగుజాడలకు సంబంధించిన అనేక రహస్య క్షేత్రాలు దశాబ్దాలుగా వెలుగు చూడకుండా ఉన్నాయి. టీవీ9 దృశ్యం కార్యక్రమం ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అదృశ్యమైన రామాయణ కాలం నాటి ప్రదేశాలు ఇప్పుడు బయటి ప్రపంచానికి పరిచయమయ్యాయి. ఈ ప్రాంతంలో శ్రీరాముడు మహాదేవుడిని పూజించిన శివాలయం అవశేషాలు, శ్రీరాముడు, సీతాదేవి పండ్లు తిన్న రాతి పళ్లెం, సీతాదేవి చీర గుర్తులున్న రాళ్లు వంటి ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. సీతాదేవి అపహరణకు గురైన పర్ణశాల, పంచవటి ప్రాంతంలోనే ఉందని గుర్తించారు. భద్రాచలంలోని 17వ శతాబ్దపు సీతారామచంద్ర స్వామి ఆలయం సైతం శ్రీరాముడి దండకారణ్య మూలాలకు గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది. ఇవి రామాయణ చరిత్రకు కొత్త ఆధారాలను అందిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

Garikipati: తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు

Loading...
Unable to load recommendations.
Follow Us