గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?

Updated on: Mar 11, 2026 | 1:21 PM

గల్ఫ్ బావుల నుంచి భారత్‌లోని ఇంధన శుద్ధి కర్మాగారాలకు చమురు చేరే ప్రయాణం సుమారు 60 రోజులపాటు సాగుతుంది. ఈ క్లిష్టమైన ప్రక్రియలో ముడిచమురును వెలికితీసి, నౌకల ద్వారా హర్ముజ్ జలసంధి మీదుగా భారత రేవులకు చేరవేస్తారు. అక్కడ శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి వంటి ఇంధనాలుగా మార్చి వినియోగదారులకు పంపిణీ చేస్తారు.

మన వంటింట్లో పొయ్యి వెలగాలన్నా, వాహనం కదలాలన్నా, గల్ఫ్ తీరంలోని చమురు బావులు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు, సముద్రమార్గంలో అలజడులు మన దైనందిన జీవితాలపై ప్రభావం చూపుతాయి. గల్ఫ్ బావుల నుంచి భారతీయ రిఫైనరీలకు ఇంధనం చేరుకోవడానికి ఒక క్లిష్టమైన ప్రక్రియను అనుసరిస్తారు. ముందుగా గల్ఫ్ దేశాల ఆయిల్ బావుల నుంచి ముడిచమురును వెలికితీసి భారీ ట్యాంకర్లలో లోడ్ చేస్తారు. ఈ ముడిచమురును పర్షియన్ గల్ఫ్ లోని ఓడల్లోకి తీసుకువస్తారు. అక్కడి నుండి హర్ముజ్ జలసంధి ద్వారా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రం మీదుగా భారత వైపు వస్తాయి. జామ్ నగర్ పోర్ట్, ముంబై పోర్ట్, ముంద్రా పోర్ట్, మంగుళూరు పోర్ట్ వంటి వెస్ట్ కోస్ట్ లోని రేవులకు ఈ ఓడలు చేరుకుంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్

Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది

ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??

బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు

Follow Us