Book: 51 ఏళ్ల తర్వాత లైబ్రరీకి పుస్తకాన్ని తిరిగిచ్చిన వ్యక్తి.. లెటర్లో ఏం రాశాడో చూస్తే నవ్వాగదు..
ఇప్పుడంటే.. ఏ విషయం తెలుసుకోవాలన్నా, గూగుల్ సెర్చ్ చేసేస్తున్నాం.. కానీ కొన్నేళ్ల క్రితం వరకూ చదువుకోవాలన్నా, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా.. పాఠశాలలు, కళాశాలల లైబ్రరీలను ఆశ్రయించాల్సిందే.
ఇప్పుడంటే.. ఏ విషయం తెలుసుకోవాలన్నా, గూగుల్ సెర్చ్ చేసేస్తున్నాం.. కానీ కొన్నేళ్ల క్రితం వరకూ చదువుకోవాలన్నా, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా.. పాఠశాలలు, కళాశాలల లైబ్రరీలను ఆశ్రయించాల్సిందే. తాజాగా .. బ్రిటీష్ కొలంబియాలోని ఓ లైబ్రరీలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. 1971లో ఒక వ్యక్తి తన పేరు మీద పుస్తకాన్ని లైబ్రెరీ నుంచి తీసుకున్నాడు.. ఇప్పుడు ఐదు దశాబ్దాల తర్వాత పుస్తకం తిరిగి లైబ్రరీకి రిటర్న్ ఇచ్చాడు. పుస్తకాన్ని తిరిగిచ్చిన వ్యక్తి అందులో చిన్న నోట్ రాసి ఐయామ్ సారీ అంటూ ఆలస్యానికి క్షమాపణలు చెప్పాడు. అయితే దాదాపు 50 ఏళ్ల తర్వాత లైబ్రెరీకి పుస్తకాన్ని తిరిగిస్తే.. అతను ఊహించనంత భారీ జరిమానా విధించారనే మనమంతా అనుకుంటాం. దానికి సమాధానంగా . ఆ వ్యక్తి నిజాయితీయే అతనికి అదృష్టం తెచ్చింది. ఆ వ్యక్తి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని లైబ్రెరీ అధికారులు తెలిపారు. ఇటీవల లైబ్రరీ తన నిబంధనలను మార్చిందట. ఆలస్యంగా పుస్తకాన్ని తిరిగిచ్చేవారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్లోకి వెళ్లనని తనయుడు మారం..