పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి

Updated on: May 05, 2026 | 4:10 PM

మస్కట్‌లో బందీగా చిక్కుకున్న షానాలా అనే తెలుగు మహిళ తన గోడును వెళ్లబోసుకుంటూ పంపిన వీడియో వైరల్ అవుతోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన షానాలా, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం మస్కట్ వెళ్లగా, అక్కడ చిత్రహింసలకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తన సోదరుడిగా భావిస్తూ, రక్షించి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు.

మస్కట్‌లో బందీగా చిక్కుకున్న ఒక తెలుగు మహిళ తనను కాపాడాలని వేడుకుంటూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురానికి చెందిన షానాలా, ముగ్గురు పిల్లల తల్లి. నిరుపేద కుటుంబం కావడంతో, పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి ఒక ఏజెంట్ ద్వారా కొద్ది రోజుల క్రితం మస్కట్ వెళ్లారు. అక్కడ పని ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ ఆమెను ఒక సేటుకు అప్పగించారు. అయితే, ఆమె ఆశించిన దానికి భిన్నంగా అక్కడ దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయి.శనివారం రాత్రి ఆమె సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలో తన గోడును వెల్లడించారు

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్

Follow Us