దొంగల ముఠాకు దిమ్మదిరిగే షాకిచ్చిన మేకలు

Updated on: Sep 15, 2025 | 4:23 PM

మూగజీవాలు తమ యజమానిపై చూపిన విశ్వాసం.. ఓ దొంగల ముఠా ఆట కట్టించింది. మూడు రోజుల క్రితం ఒక దొంగలముఠా మేకల మందను దొంగిలించగా మేకల యాజమాని వాటిని వెతుక్కుంటూ మేకలు అమ్మే మార్కెట్‌లో వెతుకులాటకు దిగాడు. కాగా.. మార్కెట్లో తమ యజమాని కుమారుడిని చూడగానే గుర్తుపట్టిన మేకలన్నీ.. పొలోమని.. అతని వద్దకు పరుగులు తీయటంతో.. వాటిని అమ్మటానికి వచ్చిన దొంగల ముఠా గుట్టు రట్టయింది.

హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడ మార్కెట్లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లకు చెందిన వెంకటయ్యకు 30 మేకలు ఉన్నాయి. ఈ నెల 9న గుర్తుతెలియని వ్యక్తులు వాటిని దొంగిలించారు. అప్పటి నుంచి వెంకటయ్య కుటుంబ సభ్యులు తలోదిక్కున వాటి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో 11న వెంకటయ్య కుమారుడు ప్రవీణ్, మేకల కోసం వెతుకుతూ జియాగూడ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ఒక కంటైనర్ వద్ద ఉన్న కొన్ని మేకలు ప్రవీణ్‌ను చూసి గట్టిగా అరవడం ప్రారంభించాయి. అనుమానం వచ్చిన ప్రవీణ్ తాను రోజూ పిలిచే కోడ్ భాషలో వాటిని పిలిచాడు. అంతే, ఆ మేకలన్నీ ఒక్కసారిగా ప్రవీణ్ వద్దకు పరుగెత్తుకొచ్చాయి. దీంతో అవి తమవేనని నిర్ధారించుకున్న ప్రవీణ్ అక్కడ ఉన్న వ్యక్తులను నిలదీశాడు. తాము ఆ మేకలను రూ.30 లక్షలకు కొనుగోలు చేశామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు ప్రవీణ్‌ను బెదిరించారు. వెంటనే ప్రవీణ్ తన తండ్రికి, కుల్సుంపుర పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముఠాలోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మేకలను దొంగిలించినట్లు అంగీకరించారు. తమ ముఠాలో వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన మరో ముగ్గురు ఉన్నారని వారు వెల్లడించారు. ఈ సమాచారంతో చౌదరిగూడ పోలీసులు పరిగికి వెళ్లి మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద దాచి ఉంచిన సుమారు 200 మేకలను స్వాధీనం చేసుకున్నారు. మూగజీవాల విశ్వాసంతో ఓ పెద్ద దొంగల ముఠా పోలీసులకు చిక్కింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ‘మిరాయ్’కి ప్రభాస్ ఎంత తీసుకున్నారంటే..?

మరణంలోనూ వీడని బంధం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు