Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్

పెళ్లైన పక్షం రోజులకే.. అత్తతో అల్లుడు జంప్.. అదే కదా మ్యాజిక్

Phani CH
|

Updated on: Jul 03, 2025 | 6:05 PM

Share

గత కొన్నాళ్లుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు.. హత్యలు వెలుగుచూస్తున్న వేళ.. కన్నడ నాట ఓ అల్లుడి నిర్వాకం అందర్నీ షాక్‌కి గురిచేసింది. దావణగిరే జిల్లా ముద్దెనహళ్లి గ్రామంలో పెళ్లయిన పదిహేను రోజులకే అత్తతో సంబంధం పెట్టుకున్న ఓ అల్లుడు.. భార్య హేమను బస్‌స్టాప్‌లో వదిలేసి 55ఏళ్ల అత్తతో కలిసి జంప్ అయ్యాడు.

సెల్‌ఫోన్‌లో వారిద్దరి మధ్య సాగిన చాట్‌ను చూసిన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దెనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజ్, శాంత దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో ఒకరైన హేమను చెన్నగిరి తాలూకాలోని మరవంజి గ్రామానికి చెందిన గణేష్‌కి ఇచ్చి 15 రోజుల నాడు పెళ్లి జరిపించారు. అయితే, పెళ్లి అయిన 15 రోజులకే.. గణేష్, అత్త శాంతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు.. భార్యను వదిలేసి, అత్తతో పరారయ్యాడు. తర్వాత షాక్‌కి గురైన ఇరు కుటుంబాల పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ క్రమంలో పోలీసులు అత్తా అల్లుళ్ల మధ్య సాగిన మొబైల్ చాట్‌ను గుర్తించి.. అసలు సంగతి కనిపెట్టేశారు. కాగా, అల్లుడితో పారిపోయిన శాంత, నాలుగైదు రోజులకే తిరిగి తన భర్త వద్దకు ఒంటరిగా వచ్చింది. తాను అల్లుడు గణేశ్‌తో పారిపోలేదని చెబుతూ హైడ్రామా సృష్టించింది. మరోవైపు, తమ కుమారుడు కనిపించకుండా పోయాడంటూ.. గణేశ్ తల్లిదండ్రులు చెన్నగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టూ వీలర్‌ కొంటున్నారా.. ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే

జాలర్ల వలలో చిక్కిన అసలు సిసలైన చేప.. అబ్బా అదృష్టం ఆంటే ఇతనిదే

Samantha: తనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు.. అసలు నిజం బయటపెట్టిన సమంత

డ్రైనేజీ నుండి వింత శబ్దాలు.. దగ్గరకి వెళ్లి చూసిన స్థానికులు పరుగో పరుగు

కడుపునొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన మహిళ.. అనుమానం తో టెస్ట్ చేయగా.. ఖంగు తిన్న డాక్టర్స్