Viral Video: వేదికపై ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన స్వామీజీ.. విషాదంలో భక్తులు.. వైరల్ అవుతున్న వీడియో..

|

Nov 25, 2021 | 9:03 AM

తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే ఓ స్వామీజీ ప్రాణాలు విడిచారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి...


తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే ఓ స్వామీజీ ప్రాణాలు విడిచారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహాస్వామీజీ ప్రసంగం ప్రారంభించారు. అలా మాట్లాడుతున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన ప్రసంగం ఆపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.అలా కూర్చున్న స్వామీజీ కుర్చీలోనే తల వెనక్కి వాల్చి కన్నుమూశారు. పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందారు. స్వామీజీ ప్రసంగాన్ని భక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసుకుంటున్నారు. దాంతో ఈ దృశ్యం కూడా రికార్డు కాగా, తాజాగా అది సోషల్‌ మీడియాలో చేరింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on