యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్కు వింత అనుభవం ఎదురైంది. యూపీలోని బాందాలో రెండు రోజుల పాటు ఆయన పర్యటిస్తున్నారు. తన పర్యటన పూర్తి చేసుకొని, ఆయన ఓ విశ్రాంతి భవనంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన్ను కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కిపడి లేచారు. పాము కాటేసిందనుకొని, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను స్థానికంగా వుండే ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Revanth Reddy Interview: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టీవీ9 స్పెషల్ ఇంటర్వ్యూ.. (Live Video)