AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక రైళ్లలో చీమ చిటుక్కుమన్నా అవి కనిపెట్టేస్తాయ్‌ వీడియో

ఇక రైళ్లలో చీమ చిటుక్కుమన్నా అవి కనిపెట్టేస్తాయ్‌ వీడియో

Samatha J
|

Updated on: Jul 20, 2025 | 8:45 PM

Share

సాధారణంగా పట్టణాల్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు ఈజీగా వాళ్లను పట్టుకుంటారు. కానీ రైళ్లలో దొంగతనాలు జరిగితే వాళ్లను పట్టుకొవడం రైల్వే పోలీసులకు సవాలుగా మారుతుంది. దీంతో ప్రయాణికులు పొగొట్టుకున్న వాటిని తిరిగి రికవరీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. అందుకే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ట్రైన్స్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటి సహాయంతో ట్రైన్‌లలో దోపిడీలకు పాల్పడే వారిని గుర్తించొచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 74,000 రైలు కోచ్‌లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తలుపుల వద్ద ఈ కెమెరాలు అమర్చనున్నారు. ఈ చర్య ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని, ప్రయాణికులను లక్ష్యంగా చేసుకునే దుండగులు మరియు ముఠాలను నిరోధిస్తుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని రైళ్లలో ఏర్పాటు చేసి పరీక్షించారు.

మరిన్ని వీడియోల కోసం :

విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో

ఉదయాన్నే గుడికి వచ్చిన అర్చకుడు..ఆ సీన్ చూసి షాక్ వీడియో

అడవిలో కొత్త జంట హనీమూన్.. ఊహించని అతిథుల హల్‌చల్ వీడియో