అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
ఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్. అతడు రైల్వే ఉద్యోగి. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే భర్త పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆ భార్యకు అనుమానం. ఆ అనుమానం మరింత బలపడడంతో ఏకంగా భర్తనే కిడ్నాప్ చేసింది ఆ భార్య. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో కలకలం రేపింది. కదిరి ఎన్జీవో కాలనీకి చెందిన ప్రవీణ్, చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు ఐదు సంవత్సరాల క్రితం పెళ్లయింది.
పెళ్లయిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. భర్త ప్రవీణ్ కాలసముద్రంలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల మనస్పర్ధలు పెరిగాయి. భర్త ప్రవీణ్ పై భార్య మంజులకు అనుమానం మొదలైంది. తన భర్త ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న అనుమానంతో.. ఏకంగా రెండు కార్లలో 15 మంది వ్యక్తులను వెంటబెట్టుకుని.. కదిరిలో ఉంటున్న భర్త ప్రవీణ్ ను కిడ్నాప్ చేసింది. భర్తతోపాటు ఇంట్లో పని చేస్తున్న పని మనిషిని కూడా భార్య మంజుల తీసుకెళ్లింది. భర్తని కిడ్నాప్ చేస్తుండగా అడ్డొచ్చిన అత్తమామలను రెండు తగిలించింది భార్య మంజుల. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్తపై ఉన్న అనుమానంతోనే తమ కోడలు.. కొడుకును కిడ్నాప్ చేసినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ వ్యవహారాన్ని కదిరి పోలీసులు తిరుచానూరు పోలీసులకు కానిస్టేబుల్ మంజుల తీరుపై సమాచారం ఇచ్చారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ కిడ్నాప్ చేయటం ఏంటి? అందులోనూ కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయడం విడ్డూరంగా ఉంది అంటే స్థానికంగా రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం
ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..
తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??
అతిగా స్మార్ట్ఫోన్ చూస్తే.. అంతే సంగతులు
అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసారని అనస్తీషియా ఇచ్చి భార్యను కడతేర్చాడు
