ఆ ఇద్దరు పాపలకు ప్రాణం పోసిన AI వీడియో

Updated on: Apr 20, 2025 | 12:09 PM

ఏఐ అద్భుతాలను సృష్టిస్తోంది. అన్ని రంగాల్లో తన సత్తా చాటుతోంది. ఫొటోలకు ప్రాణం పోస్తూ సాధారణ ఫొటోలను కదిలే బొమ్మల వీడియోగా మారుస్తోంది. నైంటీస్ కిడ్స్‌కు ఎంతో ఇష్టమైన పార్లే జీ, అమూల్ పాపలకు కూడా ఏఐ ప్రాణం పోసింది. షాహిద్ ఎస్కే అనే వ్యక్తి తన మార్కెటింగ్ ఏజెన్సీ ప్రమోషన్ కోసం అమూల్, పార్లేజీతో పాటు మరికొన్ని ఫొటోలను వీడియోలుగా మార్చాడు.

తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్ది వ్యూస్ ను తెచ్చుకుంది. లక్షల్లో లైకులు వచ్చాయి. వీడియోను చూస్తుంటే పాత జ్ణాపకాలు గుర్తుకొస్తున్నాయనీ అమూల్, పార్లే జీ పాపలకు ప్రాణం వస్తే అచ్చం ఇలాగే ఉంటారా అంటూ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిన్ననాటి జ్ణపకాలను గుర్తు చేసుకుంటున్నారు. షాహిద్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.