ఏకాకిగా ఏక శిలా మహాగణపతి.. నిలువ నీడలేకుండా..

Updated on: Sep 14, 2024 | 1:04 PM

ప్రతి శుభకార్యంలో, పూజలో మొదటగా ఆది దేవుడు గణపతిని పూజిస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీ గల్లీల్లో వినాయక విగ్రహాల ఏర్పాటు, కోలాహలం మామూలుగా ఉండదు. అలా ప్రతి ఏడు.. వినాయక నవరాత్రులను అంగరంగవైభవంగా నిర్వహించుకుంటారు భక్తులు. కానీ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఏకశిలా మహాగణపతి నిలువ నీడ లేకుండా, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా మిగిలిపోయాడు.

ప్రతి శుభకార్యంలో, పూజలో మొదటగా ఆది దేవుడు గణపతిని పూజిస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లీ గల్లీల్లో వినాయక విగ్రహాల ఏర్పాటు, కోలాహలం మామూలుగా ఉండదు. అలా ప్రతి ఏడు.. వినాయక నవరాత్రులను అంగరంగవైభవంగా నిర్వహించుకుంటారు భక్తులు. కానీ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఏకశిలా మహాగణపతి నిలువ నీడ లేకుండా, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా మిగిలిపోయాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని అవంచలో అరుదైన మహాగణపతి కొలువుదీరి ఉన్నాడు. 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఏకశిలపై కొలువుదీరిన ఈ మహాగణపతి పంట పొలాల మధ్య వందల ఏళ్లుగా ఒంటరిగా ఉన్నాడు. ఈ భారీ గణపతి విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దుబాయ్‌ యువరాణి సంచలన పోస్ట్‌.. ఈ డైవర్స్‌ వెరీ స్పెషల్‌ అంటూ..

Loading...
Unable to load recommendations.
Follow Us