AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బతికున్న భార్యలకు పిండ ప్రదానం !!  అసలు విషయం తెలిస్తే షాక్‌ !!

బతికున్న భార్యలకు పిండ ప్రదానం !! అసలు విషయం తెలిస్తే షాక్‌ !!

Phani CH
|

Updated on: Sep 26, 2022 | 9:32 PM

Share

చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం సాధారణం.. కానీ, ఇక్కడ బతికున్న వాళ్లకు పిండ ప్రదానం చేశారు. పితృ పక్షం సందర్భంగా ముంబైలోని బంగంగా నది ఒడ్డున పలువురు తమ సజీవులైన భార్యలకు పిండప్రధానం చేయడం సంచలనంగా మారింది.

చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం సాధారణం.. కానీ, ఇక్కడ బతికున్న వాళ్లకు పిండ ప్రదానం చేశారు. పితృ పక్షం సందర్భంగా ముంబైలోని బంగంగా నది ఒడ్డున పలువురు తమ సజీవులైన భార్యలకు పిండప్రధానం చేయడం సంచలనంగా మారింది. వీరంతా భార్య బాధితులు.. వారిలో భార్యల నుంచి విడాకులు తీసుకున్నవారు లేదంటే, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నవారు కూడా ఉన్నారట. శ్రాద్ధ మాసంలో భాగంగా సముద్రం ఒడ్డున చాలా మంది చనిపోయిన వారి బంధువులకు పిండదానాన్ని అందించడం ఆచారంగా వస్తోంది. తమ పూర్వీకులకు పిండప్రదానం చేయడంతో పుణ్యం వస్తుందని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ముంబైలో దాదాపు 50 మంది జీవించి ఉన్న తమ భార్యల పేరిట దానం చేశారు. వివాహానికి సంబంధించిన చెడు జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వీరంతా పూర్తి ఆచార సాంప్రదాయాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరిలో కొందరు గుండు కూడా చేయించుకున్నారు. ఈ పిండ ప్రదాన కార్యక్రమం వాస్తవ్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. ఇలా బతికి ఉన్న భార్యలకు పిండం పెట్టడం వెనుక ఓ మర్మం దాగి ఉందట. పిండ ప్రదానం చేస్తే.. భార్యలు శాంతించి.. తమకు విముక్తి కల్పిస్తారని వారి ఆశని చెబుతున్నారు భార్యా బాధితులు. భార్యా బాధితుల కోసమే ఈ కార్యక్రమం చేపట్టామంటున్నారు ఫౌండేషన్ సభ్యులు అమిత్ దేశ్‌పాండే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!

చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??

Digital News Round Up: ఆది మళ్లీ వచ్చేస్తున్నాడు | పెళ్లి భోజనాలకు ఆధార్‌కార్డ్‌..లైవ్ వీడియో

Hyderabad Rains: దంచికొట్టిన వర్షం..పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్.. లైవ్ వీడియో

Published on: Sep 26, 2022 09:32 PM