1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం !!

|

Jul 08, 2024 | 9:27 PM

ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైనదిగా, నాశనం కానిదిగా అభివర్ణించే పురాతన ఫ్రెంచ్ ఖడ్గం అదృశ్యమైంది. రోకమడోర్ అనే పట్టణంలో 1,300 ఏళ్లుగా ఓ 100 అడుగుల ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 100 అడుగుల ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైందో అంతుబట్టక తలలుపట్టుకుంటున్నారు.

ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైనదిగా, నాశనం కానిదిగా అభివర్ణించే పురాతన ఫ్రెంచ్ ఖడ్గం అదృశ్యమైంది. రోకమడోర్ అనే పట్టణంలో 1,300 ఏళ్లుగా ఓ 100 అడుగుల ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 100 అడుగుల ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైందో అంతుబట్టక తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గా ఈ ఖడ్గం, దాని చరిత్ర నిలిచాయి. ఇప్పుడు ఆ కత్తి అదృశ్యం కావడంతో స్థానికులు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. వందల ఏళ్లుగా తమ పట్టణ చరిత్రతో ముడిపడి ఉన్న ఆ ఖడ్గం గురించి ప్రతి టూరిస్ట్ గైడ్ వివరించకుండా ఉండేవారు కాదని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు. డురండల్ గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఒక్క వేటుతో రాతిని కూడా అది రెండుగా చీల్చగలదు. 8వ శతాబ్దంలో ఆ ఖడ్గాన్ని ఓ దైవదూత, నాటి రోమన్ చక్రవర్తి చార్ల్ మేగ్నెకి అందించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ఖడ్గాన్ని తన అత్యుత్తమ సైనికుడైన రోలాండ్ కు బహూకరించారు. అయితే యుద్ధంలో మరణించే ముందు రోలాండ్ ఆ ఖడ్గం శత్రువుల చేతికి చిక్కరాదని భావించి దాన్ని విరగొట్టాలనుకున్నాడు. కానీ అది సాధ్యంకాకపోవడంతో అసహనానికి లోనై దాన్ని గాల్లోకి విసిరాడు. దీంతో ఆ కత్తి గాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరకు రొకమడోర్ పట్టణంలోని రాతికొండలో దిగబడింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం.. ఎందుకంటే ??

Follow us on