ఇటీవల పాతబస్తీలోని శ్మసానవాటికలో క్షుద్రపూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అదే శ్మసానవాటికల్లో విషసర్పాలు తిరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. జనావాసాల మధ్య ఉన్న ఈ శ్మసానవాటికలో ఆ మధ్య కొందరు మంత్రాలు, తంత్రాలతో క్షుద్రపూజలు చేసి ప్రజనలను భయాందోళనకు గురి చేసారు. ఇప్పడు తాజాగా సమాధులనుంచి విష సర్పాలు బయటకు వస్తుండటంతో స్థానికులు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పాతబస్తి లో ని అనేక స్మశాన వాటికల్లో క్షుద్ర పూజలతో తో రెచ్చిపోయిన మంత్రగాళ్లు స్మశానంలో పాములు పరుగులు పెడుతున్న విషయం తెలిసి హడలిపోతున్నారు.