ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అద్భుత సృష్టి.. చూస్తే వావ్‌ అనకమానరు

Updated on: Jan 11, 2023 | 9:01 AM

ప్రస్తుతం కృత్రిమేథ ప్రపంచాన్ని శాసిస్తోంది. మనిషి చేసే అన్ని రకాల పనులను కంప్యూటర్‌ చేసే రోజులు వచ్చేసాయి. కారు నడపడం మొదలు వంటలు చేయడం వరకు, శస్త్రచికిత్సల నుంచి చిత్ర లేఖనం వరకూ అన్నింటినీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి.

ప్రస్తుతం కృత్రిమేథ ప్రపంచాన్ని శాసిస్తోంది. మనిషి చేసే అన్ని రకాల పనులను కంప్యూటర్‌ చేసే రోజులు వచ్చేసాయి. కారు నడపడం మొదలు వంటలు చేయడం వరకు, శస్త్రచికిత్సల నుంచి చిత్ర లేఖనం వరకూ అన్నింటినీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో రూపొందించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన మాదవ్‌ కోహ్లీ అనే కళాకారుడు ఏఐ టెక్నాలజీ ఆధారంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళల ఫొటోలను షేర్‌ చేశారు. స్టీరియోటిపికల్ అనే ఫీచర్‌ సహాయంతో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళల ముఖ కవలికలను ఆధారంగా చేసుకొని వీటిని రూపొందించారు. ఢిల్లీ , ముంబై, గోవా, మహారాష్ట్ర, అస్సాం, కశ్మీర్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళల ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డాన్స్‌తో దీపిక‌ను దించేసిన‌ జ‌పాన్ యువతి.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

కొండ అంచున అరుదైన జంతువు.. నెట్టింట వైరల్

Published on: Jan 11, 2023 09:01 AM
Loading...
Unable to load recommendations.
Follow Us