AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife - Husband: మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!

Wife – Husband: మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!

Anil kumar poka
|

Updated on: Aug 11, 2024 | 9:50 PM

Share

తిరుమలలో హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండే తిరుమల క్షేత్రంలో రెండో పెళ్లిని అట్టహాసంగా చేసుకోవాలనుకున్న రాకేష్ అనే యువకుడి నిర్వాకాన్ని మొదటి భార్య బయటపెట్టింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లికి చెందిన గంగవోల్ల రాకేష్ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెండ్యాలకు చెందిన సంధ్యను 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.

తిరుమలలో హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండే తిరుమల క్షేత్రంలో రెండో పెళ్లిని అట్టహాసంగా చేసుకోవాలనుకున్న రాకేష్ అనే యువకుడి నిర్వాకాన్ని మొదటి భార్య బయటపెట్టింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లికి చెందిన గంగవోల్ల రాకేష్ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెండ్యాలకు చెందిన సంధ్యను 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. 2016 ఏప్రిల్ 29న సంధ్యను పెళ్లి చేసుకున్న రాకేష్‌కు ఇప్పుడు ఏడేళ్ల మాన్వి అనే కూతురు కూడా ఉంది.

2021 నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. ఇద్దరూ కోర్టు మెట్ల ఎక్కారు. డెమోస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కింద హనుమకొండ కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే ఈలోపు రాకేష్ రహస్యంగా రెండో పెళ్లికి సిద్ధం కావడంతో మొదటి భార్య ఎంట్రీ ఇచ్చింది. తిరుమలలోని సిద్ధేశ్వరమఠంలో తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి తిరుమలకు వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య సంధ్య. తన ఏడేళ్ల కూతురు మాన్విని వెంటపెట్టుకొని వచ్చింది. సంధ్య ఎంట్రీతో పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన రాకేష్ ఊహించని షాక్‌కు గురయ్యాడు. అక్కడి నుంచి పరారీ కాగా.. సంధ్య తిరుమల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రాకేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టులో ఉండగా విడాకులు ఇచ్చానని.. మరో యువతిని మోసం చేసి భర్త పెళ్లి చేసుకుంటున్నారని మొదటి భార్య సంధ్య ఫిర్యాదులో పేర్కొంది. భర్త ఇంట్లో ఉండేందుకు కోర్టు షెల్టర్ ఆర్డర్ ఇచ్చినా.. కొట్టి తరిమేశారని సంధ్య ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలు ఉన్న భర్త కుటుంబం ఇంట్లోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని సంధ్య ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.