నిండు ప్రాణం తీసిన పంజాబీ డ్రెస్‌.. ఏం జరిగిందంటే ??

|

Oct 17, 2024 | 1:40 PM

హైదరాబాద్‌ కొత్తపేటలో సోని అనే మహిళ అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. భర్త గుంజి వెంకటేష్‌ ఆమెతో గొడవపడ్డం ఇరుగుపొరుగు గమనించారు. అదంతా మాములు అనుకున్నారు. కానీ గట్టిగా కేకలు విన్పించడంతో ఏం జరిగిందోనని పరుగెత్తుకెళ్లిన స్థానికులకు అక్కడ రక్తపు మడుగులో సోని కనిపించింది. పక్కనే ఆమె భర్త చేతికి గాయాలతో కనిపించాడు. వెంటనే 108 ఫోన్‌చేసి పిలిపించి ఇద్దర్నీ హాస్పిటల్‌కు తరలించారు.

కానీ అప్పటికే సోని చనిపోయినట్టు నిర్దారించారు డాక్టర్లు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందని ఆరా తీస్తే వెంకటేష్‌ మొసలి కన్నీరు కార్చాడు. మాటా మాటా పెరిగి తనపై కత్తితో దాడి చేసి తనను పొడుచుకొని చనిపోయిందని చెప్పాడు. అతని మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు సోని డెడ్‌బాడీని పరిశీలించగా వీపు భాగంపై కత్తిపోటు గాయాలు కనిపించాయి. వెంటనే వెంటకేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో ప్రశ్నించారు. దాంతో అసలు విషయం చెప్పాడు వెంకటేష్. గుంజి వెంకటేష్‌- సోనీ దంపతులు ఉపాధి కోసం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు. కొత్తపేటలో వుంటున్నారు. వెంకటేష్‌ మేస్త్రీ పనులు చేసేవాడు. భర్తకు చేదోడువాదోడుగా సోని..నాలుగైదు ఇళ్లలో పనిచేసేది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కుటుంబం అంతా మొదట్లో బాగానే ఉండేవాళ్లు. కానీ గత కొన్ని నెలలుగా భార్యను అనుమానిస్తూ గొడవపడేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. పంజాబీ డ్రెస్‌ ఎందుకు వేసుకున్నావని గొడవ పడి నిండు ప్రాణం తీసేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగి తనే కత్తితో పొడుచుకుందని.. అడ్డుకునే ప్రయత్నంలో తనకు గాయాలయ్యాయని చెప్పాడు. కానీ పోలీసుల దర్యాప్తులో తనే పొడిచి చంపినట్టు అంగీకరించాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా ఎన్నికల ప్రచారంలో తెలుగులో బ్యానర్లు

శుభవార్త.. లైట్ మోటార్ వాహనాలకు.. టోల్ ఫీజులు రద్దు

గుర్రానికి ఊహించని షాక్ ఇచ్చిన పొట్టేలు.. ఏం చేసిందో చూడండి !!

లక్కీ లాటరీ గెలుచుకున్న నరేంద్రమోదీ.. ప్రైజ్‌ ఎంతంటే ??

తప్పుడు వార్తలపై… సీరియస్ అయిన కిచ్చా..

Follow us on