రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

Updated on: Jul 13, 2026 | 4:47 PM

హనీమూన్‌ను ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేసుకోవాలని నూతన దంపతులు నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ కూపేను పూలు, బెలూన్లతో అలంకరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో భద్రతా నిబంధనల ఉల్లంఘనపై రైల్వే అధికారులు స్పందించారు. కోచ్‌లోకి ప్రైవేట్ డెకరేటర్లను అనుమతించిన ఘటనపై టికెట్ కలెక్టర్‌ను సస్పెండ్ చేసి అంతర్గత విచారణకు ఆదేశించారు.

సాధారణంగా పెళ్లయిన కొత్త జంట హనీమూన్‌ కోసం మంచి టూరిస్ట్ ప్లేసులకు వెళ్తారు. కానీ ఈ జంట రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకొని వినూత్నంగా ప్లాన్‌ చేశారు. అందుకోసం రన్ అవుతున్న రైలునే ఎంచుకుంది. రైలు ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చుకోవాలనే తాపత్రయంతో.. తాము ప్రయాణిస్తున్న ఫస్ట్ ఏసీ కూపేను ఏకంగా ఫస్ట్ నైట్ బెడ్‌రూమ్‌లా మార్చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ లో జూలై 6న ఈ విచిత్ర ఘటన జరిగింది. సదరు జంట ఆన్‌లైన్ ద్వారా ప్రైవేట్ డెకరేటర్లను బుక్ చేసుకుంది. రైలు స్టేషన్‌లో ఆగిన సమయంలో లోపలికి వచ్చిన డెకరేటర్లు.. పూలు, బెలూన్లతో ఆ కూపేను లగ్జరీ హనీమూన్ రూమ్‌లా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి చేరింది. రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్ లేని ప్రైవేట్ వ్యక్తులు, బయటివారు కోచ్‌ల్లోకి ప్రవేశించడం తీవ్రమైన భద్రతా లోపం కిందకు వస్తుంది. ఇంత జరుగుతున్నా డ్యూటీలో ఉన్న టికెట్ కలెక్టర్ గమనించకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ సదరు టీసీని తక్షణమే సస్పెండ్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి అంతర్గత విచారణకు ఆదేశించామని, భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us