కాలువలో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు.. కట్ చేస్తే..
గుజరాత్లోని సూరత్లో పూజా సామాగ్రితో కాలువలో పడిన ₹2 లక్షలను అగ్నిమాపక సిబ్బంది అద్భుతంగా వెలికితీశారు. అదేవిధంగా, చెన్నైలో పారిశుధ్య కార్మికురాలు పద్మ, దొరికిన ₹45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను నిజాయితీగా పోలీసులకు అప్పగించి, పలువురి ప్రశంసలు అందుకున్నారు. మానవత్వం, నిజాయితీ ఇంకా సజీవంగా ఉన్నాయని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి.
గుజరాత్లోని సూరత్లో ఒక కుటుంబం చేసిన పొరపాటు వల్ల 2 లక్షల రూపాయల నోట్లు నీటి పాలయ్యాయి. ఆ కుటుంబ సభ్యులు పూజా సామాగ్రితో పాటు పొరపాటున రూ. 2 లక్షల నగదును కాలువలో పడేసి ఇంటికి వెళ్లారు. తీరా ఇంటికి వెళ్లాక అసలు సంగతి గుర్తుకొచ్చి.. లబోదిబో మంటూ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సాయం చేయాలని కోరారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది కాలువలోని గాజు ముక్కలు, ఇతర వ్యర్థాలను సైతం లెక్కచేయకుండా గాలించి, ఎట్టకేలకు ఆ నగదును భద్రంగా వెలికితీశారు. గాజు ముక్కలను సైతం లెక్కచేయకుండా శ్రమించి వెలికి తీసి యజమానులకు అందజేశారు. సిబ్బంది చూపిన చొరవను అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి ఉదంతమే ఇటీవల చెన్నైలో జరిగింది. డబ్బు కోసం విలువలను వదిలేస్తున్న ఈ రోజుల్లో, సామాన్య పారిశుధ్య కార్మికురాలు పద్మ ప్రదర్శించిన అసాధారణ నిజాయితీ అందరినీ అబ్బురపరుస్తోంది. చెన్నై టీ నగర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు, రోడ్డు పక్కన రూ. 45 లక్షల విలువైన 36 తులాల బంగారు ఆభరణాలు ఉన్న సంచి దొరికింది. ఆ సంపదను చూసి ఆశపడకుండా, నగలు పోగొట్టుకున్న వారు ఎంత బాధపడతారోనన్న మానవత్వంతో ఆమె తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, స్నేహితుడితో మాట్లాడుతుండగా పొరపాటున ఆ సంచిని తోపుడు బండిపై వదిలేసిన రమేష్ అనే వ్యక్తిని గుర్తించి, పద్మ సమక్షంలోనే ఆ నగలను అతనికి అప్పగించారు. పద్మ నిరుపేదరాలైనా తన నిజాయితీనే అసలైన ఆస్తిగా భావించి చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె గొప్పతనాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా ఆమెను ఆహ్వానించి సత్కరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు
రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు
క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..
