గుండెపోటు బాధితుడికి సీపీఆర్.. కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలకు అంతా షాక్
రైల్వే స్టేషన్లోకి రైలొచ్చింది. రైలెక్కే క్రమంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు . రైల్వే సిబ్బంది, ఓ వైద్యుడు వెంటనే సీపీఆర్ చేయడంతో ఆ వ్యక్తి కోలుకున్నాడు. అయితే, కళ్లు తెరిచాక ఆ వ్యక్తి అన్న మాటలు అక్కడున్న వారిని షాక్కు గురి చేశాయి. చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఫిబ్రవరి 4న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా మీడియా కథనం ప్రకారం.. హునాన్ ప్రావిన్స్ లోని ఛాంగ్ షా రైల్వే స్టేషన్ లో 40 ఏళ్ల వ్యక్తి రైలు ఎక్కేందుకు క్యూలో ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు.
రైల్వే స్టేషన్ సిబ్బందితో పాటు ఓ డాక్టర్ వెంటనే అక్కడికి చేరుకుని సీపీఆర్ చేశారు. దీంతో కాసేపటికి ఆ ప్రయాణికుడు కళ్లు తెరిచాడు. నెమ్మదిగా కళ్లు తెరిచిన ఆ వ్యక్తి.. తాను వెంటనే ఆఫీసుకు వెళ్లాలని, హైస్పీడ్ ట్రైన్ అందుకోవాలని చెప్పడంతో వైద్యుడితో పాటు చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అలాంటి పరిస్థితిలో కూడా ఆఫీసుకు వెళ్ళాలని ఆ వ్యక్తి ఆత్రుత చెందడం చూసి అక్కడున్న వారంతా కదిలిపోయారు. అతని కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. ఇలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వెంటనే ఆఫీసుకు వెళ్లాలని ఎందుకంటాడు? అంటూ జాలిపడ్డారు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని బాధితుడికి ప్రయాణికులు సర్దిచెప్పారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
