జాగ్రత్త.. మళ్లీ ముంచుకొస్తున్న తుపాను ముప్పు వీడియో
అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలి తుపాను శక్తి ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. తుపానులకు పేర్లు పెట్టే సంప్రదాయం, దాని నియమాలతో పాటు, శక్తి పేరును శ్రీలంక పెట్టిందని సమాచారం.
అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలి తుపాను శక్తి ఏర్పడింది. భారత వాతావరణ విభాగం (ఐఎండి) వెల్లడించిన సమాచారం ప్రకారం, ద్వారకకు 240 కిలోమీటర్ల దూరంలో, పోరుబందర్ కు 270 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారింది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది.ఈ తుపానుకు శ్రీలంక శక్తి అని పేరు పెట్టింది. ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల మేరకు హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని 13 దేశాలు తుపానులకు పేర్లను నిర్ణయిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :
